యాక్టింగ్ కి దూరంగా డైరెక్షన్ కి దెగ్గరగా వి వి వినాయక్
సక్సెస్ఫుల్ చిత్రాలని అందించిన దర్శకుడు వి వి వినాయక్ గత ఏడాది తన బర్త్ డే సందర్భంగా ‘శీనయ్య’ అనే సినిమాని ప్రారంభించిన విషయం విదితమే. యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన వి.వి.వినాయక్ బ్రేక్ తీసుకుని నటుడిగా మారిన సంగతి తెలిసిందే. వినాయక్ ప్రధాన పాత్రలో చిత్రం చేయాలనీ ప్లాన్ చేసుకున్నారు అయితే ఆ చిత్రం ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇకపై డైరెక్టర్గా బిజీగా మారాలనుకుంటున్న వినాయక్ యాక్టింగ్ను దూరం పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం.
ఇకపై మెగాస్టార్ చిరంజీవి సినిమాపైనే వినాయక్ ఆశలు సాయిధరమ్తేజ్తో తీసిన ‘ఇంటెలిజెంట్’ డిజాస్టర్తో డైరెక్టర్గా అవకాశాలు తగ్గిన సమయంలో ఆయన ‘శీనయ్య’ అనే సినిమాతో కెమెరా ముందుకు వెళ్లారు. అయితే దర్శకుడిగా మంచి కెరీర్ను పాడు చేసుకుంటూ వినాయక్ తప్పు చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ రావడంతో ఆయన ఆలోచనలో పడ్డారట. యాక్టింగ్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టి డైరెక్టర్గానే కొనసాగాలని నిర్ణయించుకున్నారట. దీంతో ‘శీనయ్య’ సినిమాకు బ్రేక్ పడినట్లు సమాచారం.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘శీనయ్య’ సినిమా వస్తుందో? రాదో? తెలియదని కామెంట్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు అటకెక్కినట్లేనని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం డైరెక్షన్పైనే ఫోకస్ పెట్టిన వినాయక్ మెగాస్టార్తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఠాగూర్, ఖైదీ నం.150 వంటి బ్లాక్బస్టర్ హిట్లు అందించిన వినాయక్ అంటే మెగాస్టార్కు ప్రత్యేకమైన అభిమానం. దీంతోనే మలయాళ బ్లాక్బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్ బాధ్యతలు ఆయనకు అప్పగించారు.చిరంజీవి హీరోగా వినాయక్ రూపొందించిన రెండు సినిమాలు రీమేక్. `ఠాగూర్` తమిళంలో వచ్చిన `రమణ`కి రీమేక్… ఖైదీ నెం.150` తమిళంలో సూపర్ హిట్ `కత్తి`కి రీమేక్. ఇప్పుడు ఇప్పుడు లూసిఫర్ కూడా రీమేక్ కావడంతో చిరు ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారట. ఈ చిత్రానికి ముందుగా సాహో ఫేమ్ సుజిత్ను తీసుకున్నారు. అయితే వినాయక్ రీమేక్ స్పెషలిష్ట్ కావడంతో అవకాశం ఆయనకు దక్కింది. కెరీర్లో ఆటుపోట్లు ఎదుర్కొన్న సమయంలో దక్కిన ఈ మెగా ఛాన్సును వినాయక్ ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.













