దగ్గుబాటి అభిరామ్ను టార్చర్ పెట్టినట్లు ఒప్పుకున్న దర్శకుడు తేజ..
సీనియర్ డైరెక్టర్ తేజ చిత్రాల ద్వారా వెండి తెరకు పరిచయం చేస్తే వాళ్ళు గొప్ప హీరోలు అవుతారనే సెంటిమెంట్ వుంది. అతను పరిచయం చేసిన వారిలో ఉదయకిరణ్, నితిన్, నవదీప్, రానా దగ్గుబాటి, విలన్ గా గోపీచంద్, హీరోయిన్స్ సదా, కాజల్ అగర్వాల్, ఇలా ఎందరో నటులు వున్నారు. తేజ కూడా ఎప్పుడూ కొత్తవాళ్లతో సినిమా చేసేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఆయన దగ్గుబాటి అభిరామ్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘అహింస’ రిలీజ్కు సిద్ధంగా ఉంది. అయితే, అభిరామ్ ఈ మూవీ సెట్లో ఎలా ఏడ్చాడో రీసెంట్ ఇంటర్వ్యూలో తేజ వెల్లడించగా.. ఈ వీడియో వైరల్ అవుతోంది.
సెన్సేషనల్ డైరెక్టర్ తేజ వరుస ఫ్లాప్స్ తర్వాత ఎట్టకేలకు 2017లో దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత కాజల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో తీసిన ‘సీత’ ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. దీంతో చాలా గ్యాప్ తర్వాత నూతన నటీనటులతో తేజ దర్శకత్వం వహించిన చిత్రం ‘అహింస’ . రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమవుతుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే గోపీచంద్ ‘రామబాణం’ విడుదల నేపథ్యంలో తాజాగా ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన తేజ.. అభిరామ్పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన టార్చర్ తట్టుకోలేక దగ్గుబాటి హీరో ఎలా ఏడ్చాడు? సినిమాకు ముందు అతనికి ఏం క్లాస్ ఇచ్చాడో ఈ సందర్భంగా తెలిపాడు తేజ. ఇంటర్వ్యూలో భాగంగా గోపీచంద్.. నటులపై చేయి చేసుకునే అలవాటు గురించి తేజను అడిగాడు.
అయితే దీనికి వివరణ ఇస్తూ సినిమాను సరస్వతితో పోల్చుతూ అందరికీ సమానమేనని అన్నారు. ‘కొంతమందికి చదువు బాగా నేర్పుతుంది. కొందరికి ఇంజనీరింగ్, కొందరికి మెడిసిన్ నేర్పుద్ది. ఇంకొంతమందికి తబలా నేర్పిస్తుంది. మనకు అందరూ కావాలి. అందుకే తాత, ఫాదర్ ఎవరైనా కానివ్వండి అదంతా అనవసరమని ముందుగానే చెప్పా. మీ తాత గొప్పోడు ఓకే. మీ నాన్న గొప్పోడు ఓకే. మీ చిన్నాన్న గొప్పోడు ఒకే. నువ్వేం పీకావ్? అది చెప్పు’ అంటే బ్లాంక్ అయ్యాడని అభిరామ్ గురించి వెల్లడించాడు తేజ. ‘ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకునేందుకు నీకు చాన్స్ వచ్చింది. దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకో. మాట్లాడితే నువ్వు వాళ్ల మనుమడినని ఆలోచిస్తే చేయలేవు. క్యారెక్టర్లో నీ పేరు ఇది. ఆ ప్రకారమే బిహేవ్ చెయ్. చేసేంత వరకు వదలను’ అని అభిరామ్కు క్లాస్ ఇచ్చినట్లు తెలిపాడు తేజ.
కాబట్టి ముందే చేసేయటం బెటర్ అని అభిప్రాయపడ్డాడు. అలాగే రెండు మూడుసార్లు పక్కకెళ్లి ఏడ్చాడని కూడా చెప్పాడు. ఇలా అభిరామ్ను టార్చర్ పెట్టినట్లు ఒప్పుకున్న తేజ.. థియేటర్లో లైట్స్ ఆఫ్ చేశాక సినిమా చూసి చప్పట్లు కొట్టేవారి గురించి మాత్రమే తాను ఆలోచిస్తానని అన్నారు. అంతేకాని హీరో ఏమనుకున్నాడు? ప్రొడ్యూసర్ ఏమనుకున్నాడు? అనే విషయాలను పట్టించకోనని స్పష్టం చేశాడు. ఎందుకంటే ఫైనల్గా తమను జడ్జి చేసేది ప్రేక్షకులేనని, సినిమా తీసేది వాళ్ల కోసమేనని వివరించాడు. కాగా.. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై పి కిరణ్ ‘అహింస’ చిత్రాన్ని నిర్మించారు. గీతిక తివారి ఫిమేల్ లీడ్గా నటించిన చిత్రాన్ని ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించారు.













