కోలీవుడ్ లో కలకలం రేపుతున్నకరోనామరణాలు

ఒకే రోజు రెండు మరణాలు : సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల సంతాపాలు
కరోనా సెకండ్ వేవ్ సినీ ఇండస్ట్రీపై గట్టి ప్రభావమే చూపుతోంది. కరోనాతో సినీ ప్రముఖులు మృతి చెందుతున్నారు. తాజాగా కోలీవుడ్ డైరెక్టర్, లిరిసిస్ట్, నటుడు అరుణ్ రాజా కామా రాజ్ భార్య కరోనాతో మృతి చెందారు. అరుణ్ రాజా భార్య సింధూజ గత కొన్ని రోజులు క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే పరిస్థితి విషమించడంతో నేటి ఉదయం ఆమె కన్నుమూశారు. కరోనా తీవ్రతరం కావడం, వైద్యానికి స్పందించలేదని తెలుస్తోంది. అరుణ్ రాజా భార్య మృతితో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కోలీవుడ్ ప్రముఖులు అరుణ్ రాజాకు ధైర్యాన్ని చెబుతూ పోస్ట్లు పెడుతున్నారు. ఆయన భార్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం మన దేశం కరోనా వైరస్ ధాటికి అల్లకల్లోలం అవుతోంది. సెకండ్ వేవ్ దెబ్బకు దేశం మొత్తం కుదేలవుతోంది. రోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.. వేల మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. ఓ వైపు వ్యాక్సిన్ కొరత, వైద్య సదుపాయాలు సరిగ్గా లేక, ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ సినీ ఇండస్ట్రీపై గట్టి ప్రభావమే చూపుతోంది. కరోనాతో సినీ ప్రముఖులు మృతి చెందుతున్నారు.
తాజాగా కోలీవుడ్ డైరెక్టర్, లిరిసిస్ట్, నటుడు అరుణ్ రాజా కామా రాజ్ భార్య కరోనాతో మృతి చెందారు. పిజ్జా సినిమాతో పాటల రచయితగా కోలీవుడ్లోకి అడుగుపెట్టేశారు అరుణ్ రాజా కామా రాజ్. ఆ తరువాత రాజా రాణి సినిమాతో నటుడిగా మరో అవతారం ఎత్తేశారు. ఆ తరువాత కణా సినిమాతో కోలీవుడ్ మొత్తాన్ని ఆకట్టుకున్నారు. ఐశ్వర్యా రాజేష్, శివ కార్తికేయన్ కాంబినేషన్లో వచ్చిన కణా (తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి)తో దర్శకుడిగా అందరి దృష్ణిని ఆకర్షించారు. అలాంటి దర్శకుడి ఇంట్లో కరోనా విషాదాన్ని మిగిల్చింది.
తాజాగా మరో నటుడు మరణంతో కోలీవుడ్ విషాదంలో మునిగింది. అసురన్ సినిమాలో నటించిన నితీష్ వీర(45) కోవిడ్తో తాజాగా మరణించారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. రోజురోజుకూ మరణాలు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక సినీ ఇండస్ట్రీలోనూ కరోనా మరణాలు ఎక్కువ అవుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇందులో చాలా మంది ప్రాణాలను కోల్పోతోన్నారు. తాజాగా కోలీవుడ్లో వరుసగా కరోనాకు బలి అవుతున్నారు. నేటి ఉదయం పాటల రచయిత, సింగర్, నటుడు దర్శఖుడు అరుణ్ రాజా కామరాజ్ భార్య సింధూజ కరోనాతో మరణించారు. తాజాగా మరో నటుడు మరణంతో కోలీవుడ్ విషాదంలో మునిగింది. అసురన్ సినిమాలో నటించిన నితీష్ వీర(45) కోవిడ్తో తాజాగా మరణించారు. అసురన్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో విలన్గా కనిపించిన నితీష్ వీర కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. సెల్వ రాఘవన్ తెరకెక్కించిన పుదుపెట్టై సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నితీష్ వీర మరణంతో సెల్వ రాఘవన్ విషాదంలో మునిగారు. నా మని ఆత్మకు శాంతి చేకూరాలి అని నాటి పాత్రను గుర్తు చేసుకున్నారు. ఇక అసురన్ నటి అభిరామి స్పందిస్తూ.. నితీష్ అన్న మరణంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాను.. ఎంతో అద్భుతమైన నటుడు.. ఇది ఎప్పుడూ ఊహించలేదు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని పోస్ట్ చేశారు. ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.