త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ ఛార్మి

ముప్పై మూడేళ్ళ గ్లామర్ హీరోయిన్ ఛార్మి కౌర్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతోందట. ఇపుడు ఈ వార్తే టాలీవుడ్లో హాట్ టాపిక్గా నిలిచింది.పదమూడేళ్ల వయసులోనే ‘నీతోడు కావాలి’ చిత్రం తో టాలీవుడ్కు పరిచయమైన ఈ భామ అమ్మానాన్న చెప్పిన వరుడినే త్వరలోనే పెళ్లాడనుందట. అయితే పెళ్లిపై తనకు నమ్మకం లేదనీ, తనకెలాంటి తోడు అవసరం లేదని గతంలోనే కుండబద్దలు కొట్టిన ఈ పంజాబీ భామ ఇపుడిక మనువుపై మనసు పడినట్టు సమాచారం. తమ సమీప బంధువుతో కలిసి ఏడు అడగులు నడిచేందుకు సిద్ధమవుతోందటఛార్మి. ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఛార్మి పెద్దవాళ్ల నిర్ణయం తో వరుణ్ణి చూసి చేస్తున్నారు కాబట్టి త్వరగా పెళ్ళి చేసుకోమని చెప్పిందట దర్శకుడు పూరి జగన్నాథ్ భార్య లావణ్య. మూడు పదుల వయసు దాటినా ఇప్పటిదాకా పెళ్లి ఊసెత్తని ఛార్మి, పూరితో డేటింగ్లో ఉందన్న పుకార్లు చాలా కాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి పూరి కనెక్ట్స్ అనే నిర్మాణం సంస్థను మెుదలుపెట్టారు.
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనక్ట్స్ బ్యానర్స్ పై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. పూరీకి సంబంధించిన వ్యవహారాలల్లో పూర్తిగా తలమునకలైన ఈ ఛార్మి ఫుల్ బిజీగా వుంది. అలాగే ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్తో వీరిలో జోష్ పెరిగిన సగతి తెలిసిందే. కాగా పదేళ్ల క్రితం స్టార్ మ్యూజిక్ డైరెక్టర దేవిశ్రీ ప్రసాద్తో డేటింగ్లో ఉందని త్వరలోనే పెళ్లి అంటూ గతంలో పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఎవరు, ఏంటి వివరాలను ప్రస్తావించకుండానే తాను ప్రేమలో విఫలమయ్యానంటూ చార్మి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. ఏదైతేనేం పెళ్లే వద్దనుకున్నా ఛార్మి త్వరలో ఓ సిందూరం పెట్టుకోబోతున్నందుకు సిద్ధం కావడం విశేషం.