ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో తెలుగు సెలబ్రిటీలు
ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ పత్రిక ఫోర్బ్స్ అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 వరకు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ఆదాయం ఆధారంగా వంద మంది జాబితా తయారు చేసి రిలీజ్ చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ తారలు కూడా ఉండడం విశేషం. ఫోర్బ్స్ రిలీజ్ చేసిన జాబితా ప్రకారం దేశంలో అత్యధిక ఆదాయం సంపాదించిన వ్యక్తిగా రెండవ సారి సల్మాన్ ఖాన్ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాతి పది స్థానాలలో షారుక్, విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్, సచిన్ లెండూల్కర్, అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రా, ధోనీ, హృతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్లు నిలిచారు. ఇక దక్షిణాది సెలబ్రిటీలలో పీవీ సిందూ 13, రాజమౌళి 15, ప్రభాస్ 22వ స్థానంలో ఉన్నాడు.













