నో టైమ్ టు డై…మళ్లీ వాయిదా

జేమ్స్ బాండ్ సినిమా నో టైమ్ టు డై మళ్లీ వాయిదా పడింది. కోవిడ్ వల్ల ఆ సినిమా ఈ ఏడాది అక్టోబర్లో రిలీజ్ చేయనున్నారు. వాస్తవానికి గత ఏడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్కు వాయిదా వేశారు. అయితే కరోనా నుంచి ఇంకా థియేటర్లు కోలుకోలేదని, అందుకే ఆ మూవీని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీన నో టైమ్ టు డై ని రిలీజ్ చేయనున్నారు. ఎంజీఎం, కామ్కాస్ట్ కార్ప్స్ యూనివర్సల్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ సినిమాను మొదటి నవంబర్కు వాయిదా వేశారు. కరోనా వల్ల మళ్లీ 2021 ఏప్రిల్కు వాయిదా వేశారు. సుమారు 200 మిలియన్ల డాలర్ల ఖర్చుతో సినిమాను రూపొందించారు. బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో డానియల్ క్రేగ్ నటిస్తున్నాడు.