పెండింగ్ స్థానాలపై రేవంత్ రెడ్డి ఢిల్లీ భేటీ..

హైదరాబాదులో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరఫున హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు పై అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలతో భేటీ కావడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనం అయ్యారు. ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో జరిగిన రంజాన్ వేడుకలలో పాల్గొన్న తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. పెండింగ్ లో ఉన్న స్థానాల ఎంపిక విషయంలో పార్టీ పెద్దలతో భేటీ తర్వాత అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయబోతున్నారు. 17 లోక్ సభ స్థానాలలో కనీసం 10కి పైన విజయం సాధించి తమ సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ గెట్టి పట్టుదల మీద కృషి చేస్తుంది. శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. అందుకే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో తమ సత్తా చాటాలి అని రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.