హైడ్రా గురించి బ్యాంకర్లకు ఆందోళన అవసరం లేదు

హైడ్రా గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో ఆయన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలను పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని తెలిపారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)కు ఇచ్చిన రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉందని, వారికి పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలన్నారు.