ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ సంచలన వ్యాఖ్యలు
ఆంధప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు మెడికల్ కళాశాల వైద్య విద్యార్థుల ప్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జగన్ అప్పులు తెచ్చి మరి రాష్ట్రానికి అన్నీ చేస్తున్నారు. కొత్తగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. మనది పేద దేశం ఎవరినీ ఏమీ చేయలేరు. కర్నూలు సర్వజన వైద్యశాలకు వైద్యులు రాకపోవటం పెద్ద సమస్య కాదు. వైద్యులకు మనం రూ.2 లక్షలు జీతం ఇస్తుంటే.. బయట రూ.5 లక్షలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వంలో మంచి పనులు చాలా చేస్తున్నపుడు చెడు పనుల గురించి మాట్లాడకూడదని అని వీసీ వ్యాఖ్యానించారు.













