Minister Lokesh: రాష్ట్రంలో వంద బడుల్లో అలాంటి పరిస్థితి : మంత్రి లోకేశ్

మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాఉయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం అంశంపై శాసనసభలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు (Chadalawada Aravindababu) అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఉపాధ్యాయులు (Teachers) పలు సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేది మా లక్ష్యం. పాఠశాల భవనాల నిర్మాణం కోసం దాతల సహకారం కోరుతున్నాం. భవనాలపై దాతల పేర్లు ఉండేలా చూస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావాలనేది మా ఉద్దేశం. అన్ని ప్రభుత్వ బడుల్లో సీట్లు నిండి నో అడ్మిషన్ (No admission) బోర్డులు పెట్టాలనేదే నా లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు వంద బడుల్లో అలాంటి పరిస్థితి ఉంది అని తెలిపారు.