చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరైన విదేశీ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ ఆతిథులు హాజరయ్యారు. వివిధ దేశాల తరపున కాన్సల్ ప్రతినిధులు వచ్చారు. వారిలో సింగపూర్, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ తదితర దేశాల ప్రతినిధులు ఉన్నారు. ఎడ్గర్ పాంగ్ ( సింగపూర్ కాన్సల్ జనరల్, చెన్నై) సిలాయ్ జకీ ( ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్), చాంగ్ న్యూన్ కిమ్ (రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సల్ జనరల్, చెన్నై) టకహషి మునియో ( జపాన్ కాన్సల్ జనరల్, చెన్నై), గారెత్ విన్ ఒవెన్ ( బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్), థియర్రీ బెర్త్లాట్ ( ఫ్రాన్స్ కాన్సల్ జనరల్, బెంగళూరు), మహ్మద్ అరిపుర్ రెహమాన్ ( బంగ్లాదేశ్ డిప్యూటీ కాన్సల్ జనరల్, చెన్నై), ఇవోట్ డెవిత్ ( నెదర్లాండ్స్ కాన్సల్ జనరల్, ముంబయి), జెన్నిఫర్ అడ్రియానా లార్సన్ ( యూఎస్ కాన్సల్ జనరల్, హైదరాబాద్), మహదీ షారోఖీ ( కాన్సల్ జనరల్ ఆఫ్ ఇరాన్, హైదరాబాద్), సెంథిల్ తొండమాన్ ( గవర్నర్, ఈస్ట్రన్ ప్రావిన్స్, శ్రీలంక) తదితరులు హాజరయ్యారు.













