Chandrababu: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
• అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చ.
• రాజధానిలో అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణాలపైనా సమీక్షించనున్న అథారిటీ.
• ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయం మంజూరుపై సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సమీక్ష.
• రాజధానిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన యోగా, నేచురోపతి సెంటర్ నిర్మాణంతో పాటు పలు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష.
• అమరావతిలో పంపింగ్ స్టేషన్లు, జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు సంబంధించి చర్చించి ఆమోదం తెలియచేయనున్న సీఆర్డీఏ అథారిటీ.
• జరీబు- మెట్ట భూముల వర్గీకరణపై రాష్ట్ర స్థాయి కమిటీని నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్న అథారిటీ సమావేశం.
• సీఆర్డీఏ అథారిటీ సమావేశానికి హాజరైన పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్, సీఆర్డీఏ, ఏడీసీఎల్ ఉన్నతాధికారులు.






