అన్ని రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం… ఏకే సింఘాల్

వ్యాక్సినేషన్ విషయంలో మనం ఆదర్శంగా నిలిచామని ఆంధప్రదేశ్ వైద్యారోగ్య ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న వ్యాక్సినేషన్ పక్రియపై ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒక్కరోజే 6 లక్షల 29 వేల వ్యాక్సినేషన్లు వేసి మిగిలిన రాష్ట్రాలు కంటే ఆదర్శంగా నిలిచామన్నారు. మన వ్యాక్సినేషన్ కెపాసిటీ ప్రధానికి వివరించామని తెలిపారు. ఫ్రంట్లైన్ వారియర్స్, డాక్టర్లు, 45 ఏళ్ళు పైబడిన 73,49,960 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 53,58,712 మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తవ్యగా.. 17,96,691 మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కంప్టీల్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో మరో 53 లక్షల మందికి పైగా సెకండ్ డోస్ ఇవ్వాలి అని తెలిపారు. వారంలో నాలుగు రోజులు 25 లక్షలు వ్యాక్సినేషన్ వేసే విధంగా, నెలకు కోటి వ్యాక్సిన్ కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు.