ఏపీలో 5వేలు దాటిన కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా ఉద్ధతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 15,085 మంది నమూనాలు పరీక్షించగా 216 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 69 ఉండగా, రాష్ట్రంలో 147 పాజిటివ్ కేసులు వచ్చారు. పొరుగు దేశాలు, రాష్ట్రాలు నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,029 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 77కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,403కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 1,510 మంది చికిత్స పొందుతున్నారు.






