ఏపీలో 4112 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధ్ధ•తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,986 మంది నమూనాలు పరీక్షించగా 141 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 43 ఉండగా, రాష్ట్రంలో 98 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 4,112 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణాలో ఒకరు, గుంటూరులో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 71కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,273కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 1,033 మంది చికిత్స పొందుతున్నారు.






