TAGKC: కాన్సాస్ సిటీ లో ఘనం గా ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యం లో నిర్వహించిన ఉగాది (Ugadi) వేడుకలు స్థానిక ఓలేత నార్త్ వెస్ట్ హై స్కూల్ లో ఎంతో ఘనం గా జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు 750 మంది హాజరయ్యారు. ప్రోగ్రాం కమిటీ చైర్ శ్రీమతి యామిని వల్లేరు ఆహ్వానితులకి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హిందూ టెంపుల్ అఫ్ కాన్సాస్ సిటీ పూజారి శ్రీ శ్రీనివాసాచార్యులు గారి పంచాంగ శ్రవణం, వారి అర్థవంతమైన వివరణ మరియు ఆశీర్వచనాలు, వేడుకకు ఆధ్యాత్మిక మాధుర్యం జోడించాయి. బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్ శ్రీ శ్రీని పెనుగొండ తమ నూతన బోర్డు సభ్యులని అందరికి పరిచయం చేసారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీమతి శ్రావణి మేక నూతన కార్యవర్గ సభ్యులని పరిచయం చేస్తూ వారు కాన్సాస్ లోని తెలుగు వారికి చేస్తున్న సేవ ని కొనియాడారు.
ఇతర సంస్థల మహిళా నాయకులైన ఉషా సాహ, అభిరుచి సింగ్ మరియు కళై పద్మనాభన్ ను బోర్డు సభ్యులు సరితా ఎడ్మ, దీప్తి వొడ్నాల, శ్రావణి మేక సన్మానించారు. ఆర్ట్స్, చెస్, పికిల్ బాల్ పోటీల్లో విజేతలకు, రాఫెల్ విన్నర్లకు బహుమతులు స్పోర్ట్స్ చైర్ శ్రీ సురేష్ తుమ్మల, బోర్డు సభ్యులు అభిరాం దువ్వూరి అందచేశారు. కళాత్మక ప్రదర్శనలతో వేదిక నిండిపోయింది. కూచిపూడి మరియు భారతనాట్యం వంటి నృత్యరూపాలతో పాటు సినిమా పాటల డాన్సులతో పిల్లలు, పెద్దలు అందరిని అలరించారు. వారి నైపుణ్యం, సంస్కృతిని ప్రతిబింబించడంలో వారు చూపిన కృషి మాకు ఎంతో గర్వకారణంగా నిలిచాయి.
ఈ కార్యక్రమాన్ని ఆంకర్ శ్రీమతి దీప్తి యాయవరం ఎంతో సజావుగా నడిపించారు. చివరిగా కమిటీ వైస్ ప్రెసిడెంట్ మధు గంట కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన దాతలకు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలుపుతూ భారత జాతీయ గీతం తో ముగించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అందరికి ఫుడ్ కమిటీ చైర్ శ్రీ ఉమాకాంత్ పార్శి గారి ఆధ్వర్యం లో అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ వారు కమ్మని విందుని అందించారు.








