న్యూ జెర్సీ లో రామచంద్ర రావు (మాజీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ తెలంగాణా) గారి కి ఘన సన్మానం
భారతీయ జనతా పార్టీ మాజీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అఫ్ తెలంగాణా – శ్రీ ఎన్ రామచంద్ర రావు అమెరికా పర్యటన లో బాగంగా న్యూ జెర్సీ లో ఆత్మీయ సభ (మీట్ అండ్ గ్రీట్) మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు కార్యక్రమం లో ఎన్ రామచంద్ర రావు గారు తెలంగాణా అవిర్బవం లో భారతీయ జనతా పార్టీ పాత్ర ను సబికులకు తెలియచేసారు, తెలంగాణా సాదించడంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన పాత్ర ను కొనియాడారు.
కేంద్ర ప్రబుత్వం తెలంగాణా అభివృద్ధి కోసం ఏ రకంగా సహకరిస్తుంధో తెలియచేస్తూ, స్మార్ట్ సిటీస్ ని ఏరకంగా అభివృద్ధి పరచవచ్ఛో తెలియజేసారు. దీని కోసం BJP /కేంద్ర ప్రభుత్వం /మోడిగారు అందిస్తున్న సహాయాన్ని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి కోసమా కేంద్ర, రాష్త్రా ల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలని వెల్లడిస్తూ, తమ తమ గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణా ప్రవాస భారతీయులు ని సహక రించాలిసేందిగా విజ్ఞప్తి చేసారు.
అవినీతి నిర్మూలన, విద్య వ్యాప్తి, గ్రామీణా నీటి సరపరా, తాగు, సాగు నీటి ప్రాజెక్ట్ లు, అవసరముంది అని అన్నారు. గ్రామిణా ప్రాంతం లో వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్తు సరపరా, విద్యార్థులకు వసతి గృహాల సదుపాయం, బలహీన వర్గాలకి పక్క గృహా సదుపాయం వంటి నిత్యావసర పనులను సాదించినపుడు బంగారు తెలంగాణా ను సాదించగలమని తెలియచేసారు.
బంగారు తెలంగాణా ను వేగముగా సాదించడానికి తెలంగాణా ప్రవాస భారతీయులు చురకైనా పాత్ర నిర్వoచాలని ఈ సందర్భావముగా కోరారు.
ఈ కార్యక్రమములో అఫ్-బీజేపీ పూర్వ అధ్యక్షులు కృష్ణారెడ్డి అనుగుల మాట్లాడుతూ ఆరు రాష్ట్రాలలో 7 పట్టణాలలో ఎన్ రామచంద్ర రావు గారు ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ తరుపున ప్రయాణించి 7 మీటింగ్ లు లో ప్రవాస భారతీయులలో భారత దేశములో మోడీ గారు చేసున్న అభివృద్ధి, తెలంగాణ కు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను వివరించడం అన్నది రామచంద్ర రావు గారికి ఉన్న కమిట్మెంట్ చాల ప్రాముఖ్యం.
తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ తరుపున తెలంగాణ కమిటీ లు అమెరికా వ్యాప్తముగా 16 రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం, త్వరలో మిగితా రాష్ట్రాలలో తెలంగాణ కమిటీ లు అఫ్-బీజేపీ జాతీయ అధ్యక్షులు అడపా ప్రసాద్ గారి ఆధ్వర్యములో ప్రకటిస్తాము అని తెలిపారు.
తెలంగాణ అఫ్-బీజేపీ వ్యూహాత్మక వ్యవహారాలు కో-కన్వీనర్ సంతోష్ మరియు శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ కోసం 1200 అమరులకు జోహార్లర్పిస్తూ సభ రెండు నిమిషాల మౌనం పాటించాలని కోరారు.
తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కన్వీనర్ వంశీ యంజాల మరియు కో-కన్వీనర్ ప్రదీప్ రెడ్డి కట్ట మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు కార్యక్రమంలో రాంచందర్ రావు గారు ముఖ్య అతిధిగా రావడంతో అమెరికాలో పనిదినం అయినప్పటికీ చాల మంది మిత్రులు పాల్గొనడం చాలా సంతోషకరం అని తెలిపారు.
ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ (OFBJP), మిగితా తెలంగాణా మిత్రులు నిర్వాహించినా ఈ సభలో కృష్ణారెడ్డి అనుగుల (అఫ్-బీజేపీ జాతీయ పూర్వ అధ్యక్షులు ), విలాస్ రెడ్డి జంబుల (తెలంగాణ అఫ్-బీజేపీ కన్వీనర్) , సంతోష్ రెడ్డి (తెలంగాణ అఫ్-బీజేపీ వ్యూహాత్మక వ్యవహారాలు(Strategic Affairs) కో-కన్వీనర్ ), శ్రీకాంత్ రెడ్డి తుమ్మల (తెలంగాణ అఫ్-బీజేపీ అనుసంధాన (liaison) కో-కన్వీనర్) , వంశీ యంజాల (తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కన్వీనర్), ప్రదీప్ రెడ్డి కట్ట (తెలంగాణ అఫ్-బీజేపీ న్యూ జెర్సీ ప్రాంతీయ కో-కన్వీనర్), మధుకర్ (తెలంగాణ అఫ్-బీజేపీ మీడియా కో-కన్వీనర్ ) మరియు, తెలంగాణ అఫ్-బీజేపీ సీనియర్ కార్యకర్తలు గోపి సముద్రాల , కృష్ణ మోహన్ మూలే , రఘు కనుగొ , అదే విధముగా కమ్యూనిటీ లీడర్స్ శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, రామ్ వేముల, శివాని తానా, లక్ష్మి మోపర్తి , విజయ్ కుందూరు, గోవింద్ రాజ్, ఓంప్రకాష్ నక్క, హేమచందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.













