పీవీకి భారతరత్నపై మహేష్ బిగాల హర్షం
తెలుగు జాతి గర్వించదగ్గ భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తలపెట్టిన పీవీ జయంతి శతాబ్ది ఉత్సవాలు ఏడాది పొడుగునా నిర్వహించిన మాజీ ప్రధానీ పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు 28 జూన్, 2021న విజయవంతంగా పూర్తి చేశాము, కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పీవీకి భారతరత్నను సాధించే దిశగా ఏకంగా ఆన్లైన్లో ఓ పెద్ద ఉద్యమాన్నే మొదలు పెట్టిన విషయం గుర్తు చేశారు. ప్రపంచ అంతటా వున్న ఎన్నారైల హర్షం వ్యక్తం చేస్తున్నారు, అలాగే భారత రత్న ఇవ్వడానికి కృషి చేసిన మోదీకి ఎన్నారైల తరపున ధన్యవాదాలు తెలిపారు.







