TANA: తానా 2025 మహాసభలు ఘనంగా ప్రారంభం
పలువురికి అవార్డులు…ఆకట్టుకున్న సంగీత విభావరులు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 24వ ద్వై వార్షిక మహాసభలు డిట్రాయిట్ (Detroit) సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో వైభవంగా ప్రారంభమైంది. బాంక్వెట్ కార్యక్రమంతో మహాసభలు ప్రారంభమయ్యాయి. తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, కన్వీనర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు, సునీల్ పంత్ర, కిరణ్ దుగ్గిరాల, పెద్దిబోయిన జోగేశ్వరరావులతోపాటు ఇతర తానా నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. యాంకర్ సుమ వ్యాఖ్యానంతో బాంక్వెట్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. నాదెళ్ల గంగాధర్ స్వాగతోపన్యాసం, ఉదయకుమార్ చాపలమడుగు అతిథులకు ఆహ్వానం పలికారు. అవార్డు కమిటీ ఛైర్మన్ బండ్ల హనుమయ్య పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలు విభాగాల్లో సేవలందించిన వారికి తానా మెరిటోరియస్ అవార్డులను బహుకరించారు. సైంటిఫిక్ రీసెర్చ్, ఎంట్రప్రెన్యూర్ షిప్ లో ప్రతిభ చూపినందుకుగాను డా. బెజవాడ శ్రీనివాసరావుకు అవార్డును బహకరించారు. మెడిసిన్ విభాగంలో డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ కు అవార్డును ఇచ్చారు. లిటరేచర్ విభాగంలో తానాఎక్సలెన్స్ అవార్డును డాక్టర్ వడ్లమూడిబాబుకు అందించారు. అకాడమిక్ ఆచీవ్మెంట్స్కుగాను నాదెళ్ళ ప్రణయ్ కు, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ప్రతిభ చూపిన యార్లగడ్డ రఘుకు, పొలిటికల్ విశ్లేషకుడు ఆది సతికి, మెడిసిన్,కమ్యూనిటీ సర్వీస్ కు గాను డా. కాకర్ల జగన్మోహనరావుకు, సాహిత్యవిభాగంలో ప్రసాద్ తోటకూరకు, తెలుగు బ్రాడ్ కాస్టింగ్ లో ఉదయగిరి రాజేశ్వరికి, మెడిసిన్, జీన్ థెరపికి గాను డాక్టర్ ముసునూరు కిరణ్కు, ఫైనాన్స్ టెక్నాలజీలో డాక్టర్ పరుచూరి శ్రీనివనాస్కు, సర్వీస్ విభాగంలో డా. నల్లమోతు బ్రహ్మాజీకి, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్లో డా. చెరుకుపల్లి నెహ్రూకు, అగ్రికల్చర్ విభాగంలో పాతూరి నాగభూషణంకు, కమ్యూనిటీ సర్వీస్ లో తిపిర్నేని తిరుమలరావుకు, ఆర్ట్స్ విభాగంలో శ్రీమతి ఆసూరి విజయకు, కళల విభాగంలో శ్రీమతి సంధ్యశ్రీ ఆత్మకూరికి, మెడిసిన్, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో డా. కొట్టమసు సాంబశివరావుకు, కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో కోగంటి సునీల్ కు, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్ విభాగంలో గోరంట్ల వాసు బాబుకు, సినిమా క్రాప్ట్స్ అండ్ ఆర్ట్స్ విభాగంలో మిరియాల అరుణ్కు, తానా ప్రత్యేక ప్రశంస అవార్డును కొడాలి నరహరికి, చెరుకూరి రవి, వంకాయలపాటి శ్రీనివాస్కు, గోగినేని సతీష్, అప్పలనేని నవీన్, భద్రరాజు సుబ్రహ్మణ్యం, కిలారు అనిల్, ఆలపాటి బిల్హన్, గౌతమ్ అమర్నేని తదితరులకు అవార్డులను బహకరించారు.
పురస్కార గ్రహీతలను పితాని సత్యనారాయణ, మురళీమోహన్, కామినేని శ్రీనివాస్, సొంగా రోషన్ కుమార్, వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నిర్మాత కె.ఎల్.నారాయణ, కె.వి.రావులు సత్కరించారు. నటుడు రాజేంద్రప్రసాద్, కాశీ విశ్వనాథ్, బండ్ల గణేష్, రేవంత్ రెడ్డి సోదరులు, రాఘవేంద్రరావు, ఎర్నేని నవీన్, ముక్కామల అప్పారావు తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు. ప్రెసిడెంట్ ఎలక్ట్ నరేన్ కొడాలి, బోర్డ్ చైర్మన్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి, ఇతర తానా నాయకులు, ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
చివరన ఆర్.పి. పట్నాయక్ సంగీత విభావరితో కార్యక్రమాలు ముగిశాయి. గాయని సునీత ఇతర గాయనీ గాయకులు పాటలను పాడారు.







