మిస్ మ్యాచ్ టీజర్ను విడుదల చేసిన విక్టీరీ
ఉదయ్శంకర్, ఐశ్వర్య రాజేష్ జోడీగా తెరకెక్కుతోన్న చిత్రం మిస్మ్యాచ్. సలీం దర్శకుడు. ఎన్వి నిర్మల్కుమార్ తొలిసారి స్ట్రెయిట్గా తెలుగులో చేస్తోన్న చిత్రమిది. విస్మ్యాచ్ టీజర్ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాగా ఫీలవుతున్నా. టీంకి గుడ్లక్ అని అన్నారు. హీరో ఉదయ్శంకర్ మాట్లాడుతూ నా తొలి చిత్రానికి వెంకటేష్ సపోర్టు చేశారు. ఇప్పుడు టీజర్ విడుదల చేశారు. కథకుడు, దర్శకుడు, నిర్మాత.. ఈ ముగ్గురూ ఓ అద్భుతాన్ని తీశారు. అదే మిస్ మ్యాచ్ అన్నారు. నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ ఆడియన్స్ ఆశించే అన్ని ఎలిమెంట్సూ సినిమాలో ఉంటాయి. ఉదయ్శంకర్, ఐశ్వర్య రాజేష్ చక్కగా చేశారు. దర్శకుడు ప్రతిభ కనిపిస్తుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తాం అన్నారు.













