క్యాన్సర్తో పోరాడి ఓడిన సినీ గేయ రచయిత కందికొండ
టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత కందికొండ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో పోరాడుతూ ఉన్న కందికొండ.. నేడు తుది శ్వాస విడిచారు.గతంలో కందికొండ కుటుంబానికి మంత్రి కేటీఆర్ పూనుకుని కందికొండ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత కందికొండ కన్నుమూశారు. ఆయన గత కొంత కాలం నుంచి నోటి కాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. కేన్సర్తో పోరాడుతూ కొద్దీ సేపటి క్రితం ఉరి వేసుకొని కంది కొండ చనిపోయారు. ఆ మధ్య కందికొండ ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మీద హృదయాన్ని కదిలించే వార్తలు వచ్చాయి. వాటిపై ఎంతో మంది సెలెబ్రిటీలు స్పందించారు. మంత్రి కేటీఆర్ సైతం కందికొండు కుటుంబానికి అండగా నిలిచారు. కేన్సర్తో పోరాడుతూ కొద్దీ సేపటి క్రితం ఉరి వేసుకొని కంది కొండ చనిపోయారు. మోతి నగర్లోని తన నివసిస్తున్న అపార్ట్ మెంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.
కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నారు. ఆయనకు ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలో మళ్లి కూయవే గువ్వా పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. కందికొండ ఎక్కువగా పూరి జగన్నాథ్ సినిమాలకు పాటలను అందించారు. మాస్, క్లాస్, లవ్, ఎమోషనల్ ఇలా ఏ పాటలనైనా ఆయన రాయగలరు. ఆయన రాసిన ఎన్నో మెలోడీ పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలోని మల్లికూయవే గువ్వా అనే మెలోడీ పాటతోనే ఆయన సినీ కెరీర్ ప్రారంభమైంది. ఆ తరువాత కందికొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ అలా సాగుతూ పోయింది. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, ఆంధ్రావాలా ఇలా ప్రతీసినిమాలో అద్భుతమైన పాటలు రచించారు. మరీ ముఖ్యంగా కందికొండ తెలంగాణ జానపదాలను అద్భుతంగా రాస్తుంటారు. కందికొండ రాసిన ఎన్నో బతుకమ్మ పాటలు జనాదరణను పొందాయి. కందికొండ మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కందికొండ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.













