ప్రభాస్ కు దర్శకురాలు సుధా కొంగర చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందట!

పదమూడేళ్ల క్రితం ఓ సి గ్రేడ్ మూవీ కి దర్శకత్వం వహించిన తెలుగు దర్శకురాలు సుధా కొంగర టాలీవుడ్ జనం ఆదరించకపోయేసరికి కోలీవుడ్ కు షిఫ్ట్ అయ్యారు. తమిళ్ లో ద్రోహి చిత్రం నుండి పావ కధైగల్ చిత్రం వరకు విభిన్న మైన కథలతో కోలీవుడ్ లో టాప్ దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు. మధ్య 2017లో విక్టరీ వెంకటేష్ తో తెలుగు లో స్ట్రెయిట్ చిత్రం ‘గురు’, గత ఏడాది సూర్యతో సురారై పోట్రు తెలుగు లో ఆకాశమే నీ హద్దురా! చిత్రాలు ఆమె ప్రతిభకు జనాలు పట్టం కట్టారు. ఇదంతా ఎందుకంటె? ప్రభాస్ తో ఎప్పుడు సినిమా చేస్తామా.. అంటూ దాదాపు అందరు దర్శకులు ఎదురుచూస్తుంటారు. అలాంటి పరిస్థితిలో సుధా కొంగర ప్రభాస్తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘రాధే శ్యామ్’ సినిమా పూర్తి చేసిన్న ప్రభాస్.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. దీని తర్వాత ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే సినిమా చేయనున్న ప్రభాస్ ఆ తర్వాత కూడా మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ క్రమంలో ప్రభాస్ తన కెరీర్లో తొలిసారిగా ఓ మహిళ డైరెక్టర్తో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘గురు’, ‘ఆకాశమే నీ హద్దురా’ వంటి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకురాలు సుధా కొంగర. రోటీన్గా కాకుండా విభిన్నమైన సినిమాలు చేయడంలో ఆమె ఎక్స్పర్ట్. అయితే కొద్ది రోజుల క్రితం ప్రభాస్ని కలిసిన ఆమె అతనికి స్టోరీ లైన్ వినిపించినట్లు తెలుస్తోంది. దానికి ప్రభాస్ కూడా పాజిటివ్గా స్పందించినట్లు సమాచారం. స్టోరీ లైన్ నచ్చిన ప్రభాస్.. సుధాకు మిగిత స్క్రిప్ట్ పూర్తి చేయాలని ఆమె సూచించాడట. అయితే ప్రస్తుతం ప్రభాస్కి ఉన్న కమిట్మెంట్స్ చూస్తుంటే అతనితో సినిమా చేయాలంటే ఇంకా రెండు సంవత్సరాలైన ఎదురుచూడాలి. ఒకవేళ ప్రభాస్తో సినిమా ఓకే అయితే.. ఈ గ్యాప్లు సుధా మంచి కథను సిద్ధం చేసుకొనే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై ఇప్పటికైతే అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. కానీ, తన కెరీర్లో తొలిసారిగా మహిళ డైరెక్టర్తో కలిసి పని చేసేందుకు ప్రభాస్ ఉత్సాహం చూపుతున్నాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.