Siddhu Jonnalagadda: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలసి రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని (Telangana State CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. విపత్తు సమయంలో సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటిన సిద్ధుజొన్నలగడ్డను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించారు













