కరోనాను జయించిన పవన్ కళ్యాణ్…. టెస్ట్ లో నెగటివ్ అని తేలడంతో ఫాన్స్ ఫుల్ హ్యాపీ
పవర్స్టార్ పవన్కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తన ఫామ్ హౌస్లో ఉంటూనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ రోజు తాజాగా ఆయనకు మరోసారి పరీక్షలు నిర్వహించగా, ఆయనకు కరోనా నెగిటివ్ అని తెలింది. రెండో దశలో కరోనా రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ దశలో మహమ్మారి బారిన పడుతున్నారు. టాలీవుడ్పై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా పవర్స్టార్ పవన్కళ్యాణ్ లేటెస్ట్ సూపర్హిట్ చిత్రం ‘వకీల్సాబ్’ యూనిట్కి చెందిన పలువురికి కరోనా సోకింది. హీరోయిన్ నివేదా థామస్ కు నిర్మాత దిల్ రాజు ఆ తర్వాత హీరో పవన్కళ్యాణ్కి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. తన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి వైరస్ సోకడంతో పవన్కళ్యాణ్ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. అయితే ఆ తర్వాత ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన ఫామ్ హౌజ్లో డాకర్ల పర్యవేక్షణలో చికిత్స పొందారు. దీనిపై జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేయడంతో పాటు, ఆయన ఫోటో కూడా విడుదల చేసింది.
పవన్కళ్యాణ్లో అనారోగ్య స్థితిలో చూసిన అతని అభిమానులు అందరూ పవన్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. అయితే తాజాగా వచ్చిన ఓ వార్తతో పవన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పవన్కళ్యాణ్ తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించుకోగా, ఆయనకు కరోనా నెగిటివ్ అని ఫలితం వచ్చిందట. హైదరాబాద్లోని ట్రినిటీ ఆస్పత్రిలో పవన్కు కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆయనకు వ్యాధి తగ్గినట్లు నిర్ధారణ అయిందట. అయితే దీనిపై అటు వైద్యుల నుంచి కానీ, ఇటు జనసేన పార్టీ నుంచి కానీ ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయినప్పటికీ, పవన్కు కరోనా నెగిటివ్ వచ్చిందనే వార్త తెలియగానే అతని ఫ్యాన్స్ సంతోషంగా వున్నారు.













