18 సంవత్సరాలను పూర్తి చేసుకున్న ‘ఒక్కడు’ విషయం లో మహేష్ ఎందుకు పట్టించుకోవడం లేదు ?
‘ఒక్కడు’ సినిమా విషయమై నమ్రతపై మహేష్ బాబుకు ఫేమస్ నిర్మాత ఎంఎస్ రాజు కంప్లైంట్ చేశారు. ఈ ఇష్యూ వైరల్ కావడంతో వెంటనే నమ్రత ఎంటరై మ్యాటర్కి ఫుల్స్టాప్ పెట్టేశారు. ఓ హీరోయిన్గా అంతకుమించి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణిగా నమ్రత శిరోద్కర్ ప్రతిఒక్కరికీ సుపరిచితం. మహేష్తో పెళ్లి తర్వాత వెండితెరకు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం మహేష్ తాలూకు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూనే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఎప్పటికప్పుడు మహేష్ బాబు సినిమా సంగతులతో పాటు సితార, గౌతమ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహేష్ నటించిన ‘ఒక్కడు’ మూవీ నిన్నటితో 18 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ పోస్ట్ పెట్టారు. అయితే ఈ ట్వీట్ చూసిన నిర్మాత. ఎంఎస్ రాజు, నమ్రతపై మహేష్కి కంప్లైంట్ చేయడంతో విషయం హాట్ టాపిక్ అయింది. మహేశ్ బాబు కెరీర్లో ‘ఒక్కడు’ మూవీ ఓ మైలురాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడమే గాక గత రికార్డులను తిరగరాస్తూ నిర్మాతకు లాభాల పంట పండించింది. 2003 జనవరి 15వ తేదీన ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ మూవీ శుక్రవారంతో 18 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నమ్రత తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెడుతూ ఒక్కడు పోస్టర్ షేర్ చేశారు. చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు చెప్పిన నమ్రత.. అందులో అందరి పేర్లు రాసి నిర్మాత ఎంఎస్ రాజును పేరును మర్చిపోయారు. దీంతో ఇది చూసిన ఎంఎస్ రాజు తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని మహేష్ బాబుకు చేరవేశారు. ”మహేష్.. నమ్రత గారు చేసిన పోస్టులో నా పేరు పెట్టడం మర్చిపోయారు. అయినా పర్లేదు, ఇది ఆమె క్లాసిక్ సినిమా అని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. దీంతో ఈ ఇష్యూ వైరల్ అయి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో తెలియక చేసిన తన మిస్టేక్ సరిదిద్దుకుంటూ నమత్ర తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఎంఎస్ రాజు పేరును చేర్చారు నమ్రత. ఇంత జరిగినా ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాల్సిన అవసరం వుంది మహేష్ ట్విట్టర్ కి ఫాలోయర్స్ మిలియన్ల సంఖ్యలో వున్నారు తన కెరీర్ ని మలుపు తిప్పిన ఒక్కడు విషయం లో ఒక్క ట్వీట్ కూడా పెట్టకపోవడం ఆశ్చర్యం గా వుంది.













