Karmanye Vaadhikaraste: ‘కర్మణ్యే వాధికారస్తే’ చిత్రానికి థియేటర్ లు పెంచిన నిర్మాతలు
ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే (Karmanye Vaadhikaraste). బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల అయింది. చూసిన ప్రేక్షకులు సినిమా చాలా బాగుంది అని కొనియాడారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా గ్రిప్పింగ్ గా ఉంది అని ప్రేక్షకులు మరియు సినీ ప్రముఖులు కొనియాడారు. మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా నిర్మాతలు మరిన్ని థియేటర్లు పెంచారు.
ఈ సందర్భంగా దర్శకుడు అమర్ దీప్ చల్లపల్లి మాట్లాడుతూ “మా కర్మణ్యే వాధికారస్తే అక్టోబర్ 31 న విడుదల అయింది. మంచి రివ్యూస్ వచ్చాయి. చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ అయితే సూపర్ అంటున్నారు. రెస్పాన్స్ చూసి మా నిర్మాతలు థియేటర్స్ సంఖ్య పెంచుతున్నారు. మా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చూడని వారు తప్పక చూడండి” అని తెలిపారు.
నిర్మాత డి ఎస్ ఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ “మా కర్మణ్యే వాధికారస్తే చిత్రాన్ని ప్రేక్షకులు చూసి సూపర్ హిట్ చేసినందుకు ధన్యవాదాలు. మంచి స్పందన మరియు అద్భుతమైన రివ్యూస్ వచ్చారు. 100 థియేటర్స్ లో విడుదల చేసాము ఇప్పుడు మరిన్ని థియేటర్స్ పెంచుతున్నాము. చూసిన ప్రతి ప్రేక్షకుడిని థాంక్స్, చూడని వాళ్ళు తప్పక చూడండి” అని తెలిపారు.
హీరో మహేంద్రన్ మాట్లాడుతూ “కర్మణ్యే వాధికారస్తే చిత్రం తెలుగు లో నా మొదటి స్ట్రెయిట్ సినిమా. అక్టోబర్ 31 న విడుదల అయింది. సినిమా చుసిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటున్నారు. మా నిర్మాతలు మరిన్ని థియేటర్స్ లు పెంచుతున్నారు. మా కర్మణ్యే వాధికారస్తే చిత్రాన్ని తప్పక చూడండి” అని తెలిపారు.
హీరోయిన్ అయేషా మాట్లాడుతూ “తెలుగు లో హీరోయిన్ గా ఇది నా మొదటి సినిమా. చుసిన ప్రేక్షకులకి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు” అని తెలిపారు.







