ప్రభాస్ జోడిగా కత్రినా కైఫ్?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపి కృష్ణ మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు మొన్న న్యూ ఇయర్ పండుగ కానుకగా ప్రభాస్ లుక్ ని ప్రత్యేకంగా రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇక ఈ రెండూ కూడా సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా అలానే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ చేయనున్నారు.
అయితే వీటిలో ముందుగా ప్రశాంత్ నీల్ సలార్ సినిమా ఈనెలాఖరులో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎంతో వైలెంట్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ కోసం యూనిట్ ఒక భారీ సెట్టింగుని కూడా రూపొందించిందని మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారని అంటున్నారు. హోమ్ బలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ఇద్దరు కథానాయకులు ఉంటారని అయితే వారిలో ఒకరిగా దిశా పటాని లేదా కత్రినా కైఫ్ నటించే అవకాశం గట్టిగా కనపడుతోందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేసిన యూనిట్ అతి త్వరలో మరో కథానాయికని కూడా ఎంపిక చేయనుందని రాబోయే కొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఇతర నటీనటులు అలానే సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా వెల్లడి కానున్నట్లు టాక్.













