పూరీ జగన్నాథుని దర్శించుకున్న కంగన
బాలీవుడ్ నటీమణి కంగన రనౌత్ పూరీ జగన్నాథుని దర్శించుకున్నారు. శ్రీ మందిరం సింహద్వారం ఆవరణలో పతిత పావనుని దర్శించుకుని ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ సముదాయంలోని గణపతి, విమలా దేవి వగైరా దేవతా మూర్తుల్ని దర్శించారు. రత్నవేదికపై తోబుట్టువులు బలభద్రుడు, దేవీ సుభద్రలతో జగన్నాథుడు కొలువుదీరడం విభిన్నమంటూ ఆనందం వ్యక్తం చేశారు. కంగన రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధాకాడ్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి సినిమాలో కంగన ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.













