‘దృశ్యం 2’ విడుదల ఎలా చేస్తామన్నది మేమే ప్రకటన ఇస్తాం పుకార్లు నమ్మకండి : నిర్మాత డి . సురేష్ బాబు
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళీ వర్షన్ ‘దృశ్యం 2’ ఓటీటీ ద్వారా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా దృశ్యం సీక్వల్ అయితే తెలుగు వర్షన్ రిలీజ్ గురించి రక రకాల పుకార్లు షికార్లు కొడుతున్న నేపధ్యం లో నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. సినిమాకు సంబంధించి ఏ సమాచారమైనా తామే అఫీషియల్గా ప్రకటిస్తామని అన్నారు. అప్పట్లో వచ్చిన ‘దృశ్యం’ సినిమా ఏ రేంజ్ హిట్ సాధించిందనేది మనందరికీ తెలుసు. కథలో దమ్ముంటే ఎలాంటి సినిమా అయినా హిట్ పట్టేయడం ఖాయం అని నిరూపించింది ఈ సినిమా. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ బ్లాక్బస్టర్ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ చేయగా భారీ సక్సెస్ సాధించింది. దీంతో అన్ని భాషల్లోనూ దృశ్యం 2 పేరుతో ఈ మూవీ సీక్వెల్ రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ రిలీజ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చారు నిర్మాత సురేష్ బాబు. ఒరిజినల్ వర్షన్కు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఇది థియేటర్లలో విడుదలవ్వాల్సిన సినిమా అని అంతా అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వెంకటేష్, మీనా జంటగా రూపొందిన ‘దృశ్యం 2’ కూడా ఓటీటీ వేదికపై రిలీజ్ కాబోతుందనే వార్తలు వైరల్ కావడంతో దీనిపై నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రియాక్ట్ అయ్యారు ‘దృశ్యం 2’ తెలుగు వర్షన్ కూడా ఓటీటీ వేదికపైనే రిలీజ్ కాబోతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, థియేటర్లు ఎప్పుడు పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే అప్పుడే ‘దృశ్యం 2’ ను విడుదల చేస్తామని సురేష్ బాబు అన్నారు. ఒకవేళ ఓటీటీ వెళ్లాలంటే తామే ప్రకటిస్తాం తప్ప ఇలాంటి రూమర్స్ నమ్మకండి అని ఆయన తెలిపారు.













