సిఎం ఫండ్ కు భారత్ బయోటెక్ కంపెనీ విరాళం 2కోట్లు
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. దీనికి సంబంధించిన చెక్కును కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఎం. ఎల్లా, కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి సుచిత్ర కె. ఎల్లా, ప్రెసిడెంట్ శ్రీ సాయి డి. ప్రసాద్ ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు అందించారు. కరోనా వార్స్ నిర్మూలనకు త్వరలోనే వ్యాక్సిన్ ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ చైర్మన్ కృష్ణ ఎం. ఎల్లా తెలిపారు.






