హెచ్-1బీ వీసాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
హెచ్-1బీ వీసాల- అక్రమ వలసల అంశంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆమె దీనిపై లోక్సభలో సమాధానం ఇచ్చారు. హెచ్-1బీ వీసాల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై మాట్లాడుతూ వీసా విధానంపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి ఆ దేశంతో చర్చిస్తున్నట్లు ఆమె తెలిపారు. భారత్, అమెరికా మధ్య ఉన్న వాణిజ్య ద్వేపాక్షిక సంబంధాలపై బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి వేసిన ప్రశ్నకు ఆమె స్పందించారు. భారత్ను ఎటువంటి వాచ్లిస్టులో లేదన్నారు.






