Bengaluru: నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించిన రాజ్ పథ్ ఇన్ ఫ్రాకా న్
బెంగళూరు (Bengaluru), విజయవాడ ( Vijayawada) వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ గుత్తేదారు సంస్థ నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించింది. వర్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) గిన్నిస్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ రికార్డు నెలకొల్పడాన్ని నితిన్ గడ్కరీ, చంద్రబాబు వేర్వేరుగా ప్రశంసించారు. ఈ నెల 5న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం సాతర్లపల్లి వద్ద ఈ ప్రయత్నాలను నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఈ నెల 6న బొంతలపల్లి సమీపంలో 28.89 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారిని 24 గంటల్లోపు పూర్తి చేసి మొదటి రికార్డు సృష్టించింది. అలాగే 2 గంటల్లో అత్యధికంగా 10,655 టన్నుల బిలుమినస్ కాంక్రీట్ను నిరంతరం వేసి రెండో రికార్డు సాధించింది. ఈ నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ను నిరంతరంగా వేసి మూడో రికార్డును, మొత్తం 156 లేన్ కిలోమీటర్ల (26 కిలోమీటర్ల మేర 6 వరుసలు) పొడవైన రహదారిని నిరంతరంగా నిర్మించి నాలుగో రికార్డును సృష్టించింది.






