తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా.. ఇదే

వచ్చే లోక్సభ ఎన్నికలకు దేశ వ్యాప్తంగా 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్-సురేశ్ షేట్కర్, చేవెళ్ల-సునీతా మహేందర్ రెడ్డి, నల్గొండ-కందూరు రఘువీర్రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్లను అభ్యర్థులుగా అధిష్ఠానం ఖరారు చేసింది. మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్ రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ల నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీతో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వర్చువల్గా హాజరయ్యారు.