కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏముంది? : హరీశ్ రావు

తమ ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏముంది? అని ప్రశ్నించారు. 100 రోజుల పాలన చూసి ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ మోదీకి లవ్ లెటర్ తప్పితే మీ పాలనలో ఏముంది? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు, కాంగ్రెస్ పార్టీనీ మోసం చేస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని అవుతారన్నట్లు మాట్లాడారు. కాంగ్రెస్ గెలవదనె చెప్పకనే చెప్పారు. గుజరాత్ మోడల్ నిరంకుశమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. రేవంత్ మాత్రం గుజరాత్ మోడలే కావాలంటున్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది. రైతులకు ఇచ్చిన 4 హామీల విషయంలో రేవంత్ మాట తప్పారు. వరికి బోనస్ ఇవ్వకుండా ఓట్లు ఎలా అడుగుతారు? అని ప్రశ్నించారు.