సీఎం రేవంత్ రెడ్డి వారిని కూడా నమ్మకపోతే ఎలా? :రామచందర్రావు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy)లో భయం, అసహనం మొదలైందని, అందుకే బీజేపీ జాతీయ అధ్య”క్షుడు నితిన్ నబీన్ ఎవరంటూ రైతుభరోసా సభలో వ్యాఖ్యానించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramachander Rao) విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నితిన్ నబీన్ (Nitin Nabin)కు వచ్చిన ఆదరణ చూసి తన పదవి ఎగిరిపోవడం ఖాయమని అర్థమై సీఎం భయాందోళనకు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే మేం ప్రకటించాం. సర్ సర్వేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే చేపడుతున్నారు. వారిని కూడా నమ్మకపోతే ఎలా. బీజేపీలో చేరేందుకు చాలామంది బారులు తీరుతున్నారు అని అన్నారు.








