రష్యాను వెనక్కు నెట్టేసిన భారత్
దేశంలో కరోనా మహమ్మారి మహోగ్ర రూపం దాల్చింది. ఏ రోజుకారోజు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో సుమారు 25 వేల పాజిటివ్ కేసులు నమోదవగా 613 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కి చేరింది. అయితే అదేరోజు సాయంత్రం నాటికి మరిన్ని కేసులు వెలుగు చూడటంతో మొత్తం కేసుల సంఖ్య 6.9 లక్షలుగా నమోదైంది. దీంతో 6.8 లక్షల కేసులున్న రష్యాను వెనుక్కునెట్టి ప్రపంచంలో కరోనా ప్రభావిత జాబితాలో భారత్ మూడో స్థానానికి ఎగబాకిందని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. అమెరికా (28 లక్షలు), బ్రెజిల్ (15 లక్షలు) తర్వాత స్థానంలో భారత్ నిలిచింది.






