దేశంలోనే ఏపీ నెంబర్ వన్
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధప్రదేశ్ ప్రభుత్వం మరోసారి రికార్డ్ సృష్టించింది. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఆంధప్రదేశ్ నెంబర్ వన్గా నిలిచింది. గడిచిన 24 గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో 448 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి 37 మంది, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆంధప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 7,50,234 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. 4,799 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 46.26 శాతం రికవరీ రేటుగా ఉంది. 10 లక్షల మందికి సగటున 14,049 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ఏపీలో పాజిటివ్ శాతం 1.38 కాగా, దేశంలో పాజిటివ్ శాతం 6.20గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 5,423 యాక్టివ్కేసులు ఉన్నాయి.






