ఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 392 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 44 మంది. ఇతర దేశాలకు చెందినవారు ఏడుగురు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,372గా ఉండగా.. అందులో రాష్ట్రానికి చెందిన కేసులు 7,451. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి 1,584 కాగా, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 337 మంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,826 మంది చికిత్స పొందుతుండగా, 4,435 మంది నయమై డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 111 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో 16,704 కరోనా పరీక్షలు నిర్వహించారు.






