ఏపీలో 5,429 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా ఉద్ధ•తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 11602 మంది నమూనాలు పరీక్షించగా 182 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 47 ఉండగా, రాష్ట్రంలో 135 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 5,429 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2540కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 1641 మంది చికిత్స పొందుతున్నారు.






