కువైట్ నుంచి తెలుగువారి రాక
కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి భారత్కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరుతో కార్యాచరణను ప్రారంభించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు విదేశాల్లో ఉన్న భారతీయులు తిరిగి వచ్చేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా కువైట్ దేశం నుంచి ప్రత్యేకంగా ఓ విమానం వచ్చింది. కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో 163 మంది శనివారం రాత్రి 10:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి వైద్య విభాగాలు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాయి. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని ఐసొలేషన్ కేంద్రాలకు, ఏమాత్రం లక్షణాలు లేనివారిని నగర శివార్లలోని హోటళ్లు, రిసార్టస్లలో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైనకు తరలించారు. కుటుంబసభ్యులు కలిసేందుకు అనుమతించలేదు. విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజులు హోటల్ క్వారంటైన్లో, మరో 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యశాఖ అధికారులు నిర్ణయించారు. పెయిడ్ క్వారంటైన్లలో రెండు రకాల ప్యాకేజీలు ఉన్నాయి. అందులో ఒకటి రూ.15 వేలు, మరొకటి రూ.30 వేలు. వీటిల్లో వైఫై సౌకర్యం కూడా కల్పించారు. ఈ నెల 17వ తేదీ వరకు విదేశాల నుంచి సుమారు 2 వేల మంది రానున్నారు.






