టాంపాబేలో నాట్స్ సంబరాలకు శ్రీకారం
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ 8వ అమెరికా తెలుగు సంబరాలు 2025 జూలై 4 నుండి 6వ తేదీ వరకు ఫ్లోరిడాలోని టాంపాలో టాంపా కన్వెన్షన్ సెంటరులో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాట్స్ టంపా బే టీమ్ ఆధ్వర్యంలో విఘ్న వినాయక పూజ నిర్వహించారు. ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయం, సమాజ స్ఫూర్తికి ప్రతిబింబంగా ఉంటుందని సంబరాల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు.
శాస్త్రీయ, సమకాలీన నృత్య, సంగీత, నాటకాలతో పాటు సహా సాంస్కృతిక ప్రదర్శనలు, సెమినార్లు, వర్క్షాప్లు, ప్యానెల్ చర్చలు కూడా ఈ 8వ అమెరికా తెలుగు సంబరాల్లో నిర్వహిస్తామని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, సభ్యులు కొత్తా శేఖరం, శ్రీనివాస్ మల్లాది, భాను ధూళిపాళ్ల,రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ అరికట్ల, సురేష్ బొజ్జా, టాంపాబే చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, విజయ్ కట్టా, శేఖర్ యెనమండ్ర, ప్రసాద్ కొసరాజు, శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, శ్రీనివాస్ బైరెడ్డి, సతీష్ పాలకుర్తి, రవి కలిదిండి, మాధురి గుడ్ల, శైలేంద్ర గుడ్ల, మాలిని తంగిరాల, శ్యామ్ తంగిరాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







