తెలంగాణ నూతన సీఎస్గా సంజయ్ రాజు
తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శి ( సీఎస్) గా సంజయ్ జాజు (Sanjay Jaju) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్గా ఉన్న రామకృష్ణారావు (Ramakrishna Rao) ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజును ప్రభుత్వం నియమించింది.కేంద్ర సర్వీసులో ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్న సంజయ్ జాజును తెలంగాణ రాష్ట్రానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కొత్త ప్రధాన కార్యదర్శి పోస్టుకు సంజయ్ జాజుతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్రంజన్ (Jayesh Ranjan) పేరును కూడా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పరిశీలించారు. చివరికి సంజయ్ జాజు వైపే ఆయన మొగ్గు చూపారు.








