Bandi Sanjay :ఇది కాంగ్రెస్ ప్రభుత్వ మతిలేని చర్య : బండి సంజయ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )ని ఇదేం పాలన అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. పెంచాల్సిన వేతనాలను తగ్గించడమేంటని అడిగారు. ఉద్యోగులకు డీఏలు ఇవ్వరు. ఔట్సోర్సింగ్ (Outsourcing ) సిబ్బందికి వేతనాలు పెంచరా? డ్రైవర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లకు 25 శాతానికి పైగా వేతనాలు తగ్గించడం దుర్మార్గం? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ మతిలేని చర్య. నాలుగేళ్లుగా ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు ఎందుకు పెంచడం లేదు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections )గుణపాఠం చెప్పినా తీరు మారదా? తక్షణమే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలను పెంచండి అని సంజయ్ అన్నారు.