Gorantla : నా మాట వినలేదు.. ఇప్పుడు వాళ్లు ఫలితం అనుభవిస్తున్నారు : గోరంట్ల
ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవమానాలు ఎదురైనా కూటమి కొనసాగుతుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Chowdary) అన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుచూపు గల సీఎం చంద్రబాబు (CM Chandrababu) నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అర్థం చేసుకున్నారని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన వాళ్లతో ఆయన్ను రెచ్చగొట్టాలని వైసీపీ చూస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదు. జగన్ నియంత. గోదావరిపై దిగువ రాష్ట్రంగా ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మి ంచుకుంటే తప్పేంటి? అధికారంలో లేనప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం కేసీఆర్కు అలవాటు. ఆయన నాకంటే జూనియర్. కేసీఆర్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల అవినీతిపై విచారణ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను కేసీఆర్, జగన్ పరిష్కారం కానివ్వలేదు. తెలుగు యూనివర్సిటీ సమస్యను ఇటీవల పరిష్కరించాం. వైసీపీ నేతలు కొడాలి నాని (Kodali Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) నోరు అదుపులో పెట్టుకోవాలని గతంలోనే చెప్పేవాడిని. నా మాట వినందుకు ఇప్పుడు వాళ్లు ఫలితం అనుభవిస్తున్నారు అని అన్నారు.






