అమెరికాలో తెలుగు వ్యక్తి అరెస్టు

కదులుతున్న రైలు కింద మహిళలను తోసినందుకు అమెరికాలో తెలుగు వ్యక్తిని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తు ఆ మహిళ రైలు పట్టాల మధ్యలో పడిపోవడంతో ప్రమాదం నుంచి త్రుటిలో బయపడ్డారు. రైలు ఆమె పై నుంచి వెళ్లింది. నిందితుడిని ఆదిత్య వేములపాటి (24)గా గుర్తించారు. న్యూయార్క్ రాష్ట్రం మాన్హటన్ నగరంలో గురువారం జరిగిన ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదిత్యపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డిసెంబరు 4 వరకు కోర్టు అతడికి రిమాండ్ విధించింది.