పొంగులేటి సుధాకరరెడ్డికి డాక్టరేట్
తెలంగాణ శానసనమండలిలో కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకరరెడ్డికి అమెరికాకు చెందిన కింగ్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను అందించింది. చైన్నెలో జరిగిన ఒక కార్యక్రమంలో జస్టిస్ టి.ఎన్.వల్లినాయగన్ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ జ్యోతి సుద్భావనా యాత్ర చైర్మన్ ఎస్.ఎస్. ప్రకాశం, కింగ్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్.సెల్విన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 3 దశాబ్దాల రాజకీయ జీవితం, సద్భావన యాత్రలు తదితర కార్యక్రమాలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును అందజేశారు.













