తెలంగాణలో అమిత్ షా పర్యటన
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యాటన ఖరారైంది. మే నెలలో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. 24వ తేదీ నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు సమావేశాలకు కూడా ఆయన హాజరుకానున్నారు. పార్లమెంటు సమావేశాల సందర్బంగా పలు బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఇతర పార్టీ నేతల మద్దతును కూడగట్టే విషయంలో బిజీగా ఉండడంతో హైదరాబాద్ పర్యటనను గతంలో రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.






