చంద్రబాబుతో వేదాంత రిసోర్సెస్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ భేటీ
దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో వేదాంత రిసోర్సెస్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ సమావేశమయ్యారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద భారత్లో చేపట్టిన కార్యక్రమాలను అనిల్ వివరించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నామని చంద్రబాబుకు వివరించారు. ఏపీలో పైలట్ ప్రాజెక్టుగా వంద ‘నంద్ ఘర్’ విద్యాలయాలు ప్రారంభిస్తామని అనిల్ అగర్వాల్ తెలిపారు.






