ఉగాది కానుకగా మహర్షి టీజర్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. పూజా హెగ్డే కథానాయిక. రీసెంట్గా సినిమా టాకీపార్టు పూర్తిచేసుకుంది. రెండు పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఉగాది కానుకగా ఏప్రిల్ 6న టీజర్ విడుదల చేసే ఆలోచనలో వున్నారు. దిల్రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. మే 9న సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. మూడు డిఫరెంట్ టుక్స్తో మహేశ్బాబు కనిపించనుండటంతో అభిమానులంతా సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













