జూరిచ్ – ఏపీ సంబంధాలు బలోపేతం
దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జూరిచ్కు చెందిన బ్రూనో సాటర్ సమావేశమయ్యారు. ఏపీ, జురిచ్ మధ్య సిస్టర్ స్టేట్ సంబంధాలు ఆశిస్తున్నామని బ్రూనో ఆకాంక్ష వ్యక్తంచేశారు. దావోస్లో ఏపీ భాగస్వామ్యాన్ని కొనియాడారు. సాంకేతిక అంశాల్లో జూరిచ్ ముందుందని, త్వరలో ఏపీకి ఒక బృందాన్ని పంపిస్తామన్నారు. స్విట్జర్లాండ్లో బ్యాంకింగ్కార్యకలాపాల్లో డిజిటల్ లావాదేవీల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సమస్యేలేవీ తమకు ఉత్పన్నం కాలేదని బ్రూనో తెలిపారు.






